ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యె కన్నుమూత
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యె, సీసీఎం పార్టీ సీనియర్ నేత మాస్కు నర్సింహ్మ(52) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింహ్మా.. ఐదు రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాజీ ఎమ్మెల్యే మృతిపట్ల సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాస్కు నర్సింహ్మ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సీపీఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం వ్యవసాయ కార్మిక సంఘ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా కొనసాగుతున్నాడు. నియోజకవర్గ ప్రజల్లో ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/