నేను ట్రంప్‌ను కాను..సిఎం

నా ప్రజల ఇబ్బందులను నేను చూడలేను..ఉద్ధవ్ ఠాక్రే్‌ను

uddhav-thackeray

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. అయితే రాష్ట్రంలో కరోనాపై సిఎం ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘నేను డొనాల్డ్ ట్రంప్ కాదు. నా కళ్ల ముందే నా ప్రజలు ఇబ్బంది పడటాన్ని నేను చూడలేను’ అని అన్నారు. శివసేన అధికార మీడియా సామ్నాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూను సామ్నా ఎడిటర్, పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ రౌత్ నిర్వహించారు.

కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వదేశంలోనే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. వైరస్ ను కట్టడి చేయడం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదనే విమర్శలు ఉన్నాయి. తాను ట్రంప్ మాదిరి విఫలం చెందలేదనే విషయాన్ని ఉద్ధవ్ ఇంటర్వ్యూలో చెప్పారు. లాక్ డౌన్ ఇప్పటికీ అమల్లో ఉందని… అయితే ఒక్కొక్క దానికి క్రమంగా కరోనా నిబంధనల నుంచి సడలింపులు ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు ఎలాంటి పరీక్షలను నిర్వహించలేమని చెప్పారు. ఏ విద్యార్థి కూడా కరోనా బారిన పడకూడదని తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/