భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం

hyderabad-woman

sandhya reddy

ఆస్ట్రేలియా: భారతసంతతికి చెందిన సంధ్యారెడ్డికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మక స్ట్రాత్‌ ఫీల్డ్‌ సిటిజన్‌ ఆఫ్‌ ది ఇయర్‌2020 అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. అవార్డు అందుకున్న తొలి భారతసంతతి మహిళగా సంధ్యారెడ్డి గుర్తింపు పొందారు. ఆస్ట్రేలియా లోని భారతీయులు గర్వించేలా అక్కడి ప్రభుత్వం నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సమాజసేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషిచేసేవారిని స్ట్రాత్‌ ఫీల్డ్‌ సిటిజన్‌ అవార్డుకు ఎంపిక చేస్తారు. దేశంలోకి వచ్చే కొత్తవారికి సాయం చేయడం, వారికి సలహాలు సూచనలు ఇవ్వడం, పాఠశాలల్లో చేరేలా ప్రోతహిస్తూ ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా చూడటంలో సంధ్యారెడ్డి సహకారం అందించారు. క్లీన్‌అప్‌ ఆస్ట్రేలియా డేలో పాలుపంచుకోవడం, స్వచ్ఛతపై ప్రచారం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, స్థానిక పాఠశాలల్లో చదరంగం పోటీలు ఏర్పాటు చేయడం వంటి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. స్ట్రాత్‌ ఫీల్డ్‌ ప్రాంతంలో అత్యవసర సేవలందించడంలో ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సేవలకు గాను సంధ్యారెడ్డికి అవార్డుకు వరించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/