న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
మరికొన్ని గంటల్లో 2021 కి గుడ్ బై చెప్పి 2022 కు వెల్ కం చెప్పబోతున్నాం. ఈ తరుణంలో న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్ గా జరుపుకునేందుకు అంత సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు వేధించారు. డిసెంబర్ 31 రాత్రి 11గంటల నుంచి జనవరి 1 ఉదయం 5గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని.. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
డిసెంబర్ 31 రాత్రి 11గంటల నుంచి జనవరి 1 ఉదయం 5గంటల వరకు సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, మైండ్ స్పేస్, ఫోరంమాల్, రోడ్ నెంబర్ 45, దుర్గం చెరువు బ్రిడ్జ్, బాబు జగ్జీవన్ రామ్, బేగంపేట్, ప్యారడైజ్, నారాయణగూడ, బషీర్ బాగ్, ఎల్బీనగర్, మలక్ పేట్, నెక్లెస్ రోడ్, మెహదీపట్నం, పంజాగుట్ట ప్లైఓవర్లు మూసివేయనున్నారు. అలాగే క్యాబ్ డ్రైవర్లకు పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసారు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లన్నీ వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం తాగి పట్టుబడిన వారికి మోటార్ వెహికల్ యాక్ట్ 1988లోని సెక్షన్ 185 ప్రకారం చర్యలు తీసుకుంటామని మద్యం బాబులకు షాక్ ఇచ్చారు.