నేటి నుంచి తెలంగాణలో 52 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: ప్రయాణికుల సంఖ్య పెరిగిన దఅష్ట్యా 52 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ రామేశ్వరం హైదరాబాద్ మధ్య 26 సర్వీసులు, హైదరాబాద్ కొచువెలి హైదరాబాద్ మధ్య మరో 26 సర్వీసులు బుధవారం నుంచి మే 29 వరకు నడుస్తాయని రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. హోలీ కి ప్రత్యేక రైలు మార్చి 7 న సికింద్రాబాద్ నుంచి బయల్దేరి పాట్నాకు చేరుతుందని, మరోరైలు మార్చి 11 న పాట్నా నుంచి ప్రారంభమై 13 న అర్ధరాత్రి 12.40 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని పేర్కొంది.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/nri/