మెట్రో సర్వీసు సేవలు ప్రారంభం

ఉదయం ఏడు గంటలకు పరుగులు తీసిన తొలి రైలు

hyderabad metro rail
hyderabad metro rail

హైదరబాద్‌: హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైలు స‌ర్వీసు సేవ‌లు ప్రారంభం అయ్యాయి. అన్‌లాక్ 4లో భాగంగా కేంద్రం ఇటీవల సడలింపులు ఇవ్వడంతో కారిడార్ 1లో మియాపూర్ఎల్బీనగర్ మార్గంలో రైలు కూతపెట్టింది. ఉదయం ఏడు గంటలకు తొలి రైలు పరుగులు తీసింది. ఈ మార్గంలో మొత్తం 27 స్టేషన్లు ఉన్నాయి. అందులో కంటెయిన్‌మెంట్ జోన్లు అయిన మూసాపేట, భరత్‌నగర్ స్టేషన్లను మూసివేశారు. మిగతా స్టేషన్లలో ప్రతీ ఐదు నిమిషాలకు ఓ రైలు నడవనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడవనున్నాయి. రేపటి నుంచి కారిడార్ 3లోని నాగోల్రాయదుర్గం మధ్య, బుధవారం నుంచి మూడు మార్గాల్లోనూ రైళ్లు నడవనున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/