గ్రేటర్‌ ఎన్నికలు- కాంగ్రెస్‌ పంథా ఏమిటి ?

పరిస్థితి అగమ్యగోచరం!

Congress Manifesto
Congress Manifesto

గ్రేటర్‌ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చిక్కుల్లో పడిందా అనే అనుమానాలకు బలం చేకూర్చే విధంగా సదరు పార్టీలో పరిస్థితులు నెలకొన్నాయి.

ఒక్క ఓటమి ఎన్నో గుణపాఠాలను నేర్పుతుందని అంటుంటారు. గత ఆరేళ్లుగా ప్రతి ఎన్ని కల్లోనూ ఓడిపోతున్న కాంగ్రెస్‌ వైఖరిలో కొంత అయినా మార్పు కానరావడం లేదు. గడిచిన ఆరేళ్లలో పార్టీ ఎన్ని ఓటములు చవి చూసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

అదే విధంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ యోధానుయోధులు కూడా ఘోర మైన రీతిలో ఓటమి చవిచూశారు. ఇక దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ అంతంత మాత్రమే.

తెలంగాణ ఇచ్చింది తామేనని పదేపదే చెప్పుకునే ఆ పార్టీ నేడు అదే తెలంగాణలో తమ పరిస్థితి దిగజారిందంటే ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు ప్రస్తుతం ఉన్న వాళ్లలో సమర్థుడైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగిద్దామంటే సదరు పార్టీకి సీనియర్లుగా చెప్పబడుతున్న ప్రజల్లో ప్రాబల్యం తగ్గిన సీనియర్లు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్న విమ ర్శలు వస్తున్నాయి.

2004,2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో జాతీయంగా కాంగ్రెస్‌ ప్రతిభ కనబర్చింది. కొద్దోగొప్పో తెలంగాణలో కాంగ్రెస్‌ బలోపేతం అవ్ఞతుందనుకుంటే ఇక్కడ కూడా ఏమాత్రం ముందుకు పడటం లేదు. పైపెచ్చు తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైంది.

వరుస వైఫల్యాలతో ఓటమి పాలైన ప్రతీసారి ఓటమిని అంగీకరిస్తున్నారు తప్పించి ఆ ఓటమికి గల కారణాలను కాంగ్రెస్‌పార్టీ అన్వేషించిన దాఖలాలు లేవు.

దీంతో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఉనికిపాట్లు మొదలయ్యాయనే చెప్పొచ్చు. సహజంగానే పార్టీ ఉనికి కోల్పో యిన తరుణంలో పార్టీలోని నేతలు పక్క పార్టీల్లోకి జంప్‌ కావడం అనివార్యం.

మరి 130 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో ఈ పరిస్థితికి రావడానికి గల కారణమేమిటి? అసలు లోపం ఎక్కడ? అన్న అంతర్మథనం సూత్రం కానరావడం లేదని రాజకీయ విశ్లేషకుల భావనగా ఉంది.

ఇప్పటికిప్పుడు పార్టీని గాడిలో పెట్టడం అసాధ్యమనేది పార్టీ ఇంఛార్జిలుగా వ్యవహరిస్తున్న వారి మాటగా ఉంది. కుంతియా ఇంఛార్జిగా ఉన్న సమయంలో పార్టీ చెల్లాచెదురైందని అంటున్నారు.

వారు పార్టీని బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఆలస్యంగానైనా కుంతియా స్థానంలో మాణికం ఠాగూర్‌ వచ్చారు.మాణికం ఠాగూర్‌ వచ్చిన తర్వాత కొంతమేర పరిస్థితిలో మెరుగుదలకు కృషి చేసినా నేతల మధ్యసమన్వయలోపం పార్టీకి తీరని లోటుగా పరిణమిస్తోంది.

ఇక దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి చావోరేవో సమస్యగా నిలిచింది. అలాంటి దుబ్బాకలో సైతం ఫలితం వెక్కిరించింది. ఆ తర్వాత వెనువెంటనే గ్రేటర్‌ ఎన్నికల నగారా మోగింది. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక వైఫల్యం తో ఉనికిపాట్లు పడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి గ్రేటర్‌ ఎన్నికలు పెను సవాల్‌గా పరిణమించాయి.

మరోవైపు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తమలో పూర్తిస్థాయిలో జోష్‌ నింపిందని కాషాయంపార్టీ ఎగిరెగిరి పడుతోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీకి నిద్రపట్టనివ్వడం లేదు. బిజెపి, కాంగ్రెస్‌లోని ప్రముఖులకు గాలం వేస్తూ వస్తోంది.

మాజీ మేయర్‌ బండకార్తికారెడ్డి దంపతులు కాంగ్రెస్‌ని వీడి కమలం గూటికి చేరిపోయారు. ఇందుకు గల కారణాలు అనేకం. కాంగ్రెస్‌ పార్టీకి ముందు నుంచి ఆధిపత్యపోరు పెద్ద మైనస్‌గా నిలిచిందనడంలో అతిశయోక్తిలేదు.

ఇక పార్టీలో గ్రూపుల కొట్లా టలు సర్వసాధారణమన్న విషయం తెలియందికాదు. పదవ్ఞల పందేరంలో గొడవలు నిత్యకృత్యం.

ఇలాంటివన్నీ పార్టీ పరువ్ఞను దిగజార్చుతున్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇక అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట పార్టీలో లోలోన చర్చించాల్సిన అంశాలను సైతం బహిరంగంగా ఆ పార్టీ నేతలు చర్చ పెడుతుంటారు.

ఇది పార్టీ ప్రతిష్టకు ఎంత భంగం కలిగిస్తుందనేది ఆ పార్టీ నేతలకు బోధపడని స్థితి ఉందని అంటున్నారు. ఇంకోవైపు పార్టీ నుంచి ప్రముఖ నేతలు ఒక్కొక్కరే వలసలబాట పడుతున్నారు.

ఇంత జరుగుతున్నా బయటకు వెళ్లేవారిని నిలువరించే ప్రయత్నాన్ని సైతం కాంగ్రెస్‌ చేయలేకపోతోందని బహిరంగ రహస్యమేనని ఆ పార్టీ నేతలే పలు సందర్భాల్లో అంగీకరిస్తున్న మాటగా వినవ స్తోంది.

ఇదే అదనుగా గ్రేటర్‌లో మరింత బలపడేందుకు బిజెపి, కాంగ్రెస్‌లోని ప్రజాదరణ కలిగిన నేతలను పార్టీలోకి ఆహ్వాని స్తోంది. అంతేకాదు వారి వారి ఇళ్లకు వెళ్లి సంప్రదింపులు నెరుపుతోంది.

దీంతో పలువ్ఞరు నేతలు కాంగ్రెస్‌ను వీడి కమలం గూటికి చేరిపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకు న్నారు.

గ్రేటర్‌ ఎన్నికలుముసిగిన తర్వాత ఆమె ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమా చారం. విజయశాంతి ఇంటికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ§్‌ులు వెళ్లి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కొందరు ప్రము ఖులు సైతం కాంగ్రెస్‌ పార్టీని వీడేందుకు రెడీగా ఉన్నారని సమా చారం.

దీంతో గ్రేటర్‌ ఎన్నికల ముందే కాంగ్రెస్‌ డీలా పడిందన్న మాట నిజమయ్యే ఆస్కారం లేకపోలేదు. గత సంవత్సరం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో మల్కాజిగిరి నుండి యం.పిగా రేవంత్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించినారు. గ్రేటర్‌ పరిధిలో వారికి ఒక్క శాసనసభ్యులు లేరు

. తెలంగాణలో రోజురోజుకి పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాయకుల ఆధిపత్యపోరు ఎక్కువైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల లో విజయం సాధించడానికి నానా తంటాలు పడాల్సివస్తుంది. స్టార్‌ కాంపెయినర్ల కొరత ఉంది.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పు కోవాల్సిన పార్టీరోజురోజుకి పార్టీలోని అగ్రనేతలు పార్టీ మారడం కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌లా మారింది. గ్రేటర్‌ ఎన్నికల ఫలితం వస్తేగాని తేలదు. పార్టీ భవిష్యత్‌ ఎలా ఉండబోతుందో.

  • కామిడి సతీష్‌రెడ్డి

తాజా ‘నాడి వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/