17 రోజుల్లో కోటి బీర్లు తాగేసిన హైదరాబాద్ నగరవాసులు..
హైదరాబాద్ః గత పది రోజులుగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యముగా హైదరాబాద్ లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం తో..దానిని తట్టుకునేందుకు నగరవాసులు బీర్లు తాగుతూ ఎండ తీవ్రతను తగ్గించుకుంటున్నారు. తాజాగా 17 రోజుల్లో ఏకంగా కోటి బీర్లు తాగినట్లు తేలింది.
ఆబ్కారీ శాఖ లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 8,46,175 కేస్ల (ఒక కేస్లో 12 బీర్లు ఉంటాయి) బీర్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రికార్డుస్థాయిలో విక్రయాలు నమోదవుతున్నాయి.
నెలకు సగటున లక్ష చొప్పున బీరు కేసుల విక్రయాలు అధికంగా నమోదవ్వడం గమనార్హం. సాధారణంగా విస్కీ, బ్రాంది తదితర అలవాటున్న వ్యక్తులు సైతం ఎండల ప్రతాపంతో బీరు వైపు చూస్తున్నారు. ఆబ్కారీ శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్లో గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో రోజూ సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నాయి.
ఇక దేశంలోని చాలా ప్రాంతాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో అయితే చెప్పడానికి లేదు. వరుసగా మూడో రోజు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే దాదాపు 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.