ఈఏడాది కూడా చేప ప్రసాదం లేదు

క‌రోనా ప్రభావం : బ‌త్తిని హ‌రినాథ్ గౌడ్ వెల్లడి

fish prasadam - no distribution
fish prasadam – no distribution

Hyderabad: క‌రోనా వైర‌స్ తరుణంతో ఈ ఏడాది చేపప్ర‌సాదం పంపిణీ నిలిపివేస్తున్న‌ట్లు బ‌త్తిని హ‌రినాథ్ గౌడ్ తెలిపారు.కాగా గ‌తేడాది కూడా ఈ ప్ర‌సాదం పంపిణీ జరగలేదనే విషయం తెలిసింది. ఇదిలా ఉండగా ఎం మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ సూచ‌న మేర‌కు ఈ ఏడాది కూడా చేప ప్ర‌సాదం పంపిణీ నిలిపివేస్తున్నామ‌ని అయన తెలిపారు. ఏటా మృగ‌శిర కార్తె ప్ర‌వేశం రోజున ఆస్త‌మా రోగుల‌కు చేప ప్ర‌సాదం పంపిణీ విష‌యం విదిత‌మే. .మృగశిరకార్తె ప్రవేశం రోజున ప్రతి ఏటా మాదిరిగానే జూన్‌ 7వ తేదీన దూద్‌బౌలిలోని తమ నివాసంలో సత్యనారాయణ వ్రతంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 8వ తేదీన చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉదయం 10 గంటలకు తమ కుటుంబ సభ్యులందరం తీసుకుంటామని.. దగ్గరి బంధువులకు పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/