భార్య అర్ధనగ్న ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన భర్త

ఏ భర్త కూడా భార్య పరువు తీయాలని , ఆమెతో గడిపిన మధుర క్షణాలను , ఆమె తాలూకా ప్రవైట్ పిక్స్ ను బయటపెట్టాలని అనుకోరు కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి అదనపు కట్నం తీసుకరావడం లేదనే కోపంతో తనతో భార్య ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె పరువు తీసాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే ..

ఇబ్రహీంపట్నంకి చెందిన సంతోష్‌.. అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని నాలుగేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు పాటు భార్యను బాగానే చూసుకున్న సంతోష్ ఆ తరువాత తనను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తా, మామలు ఆమెను వేధించారు. అత్తింటి వేధింపులు భరించలేకపోయిన ఆమె పుట్టింటికి వెళ్ళింది. అదనపు కట్నం తీసుకురాకుండా..పుట్టింట్లోనే ఉన్నదనే కోపంతో తనతో భార్య ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆమె అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలను ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో పోస్ట్ చేసి రాక్షసానందం పొందాడు. తన ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన బాధితురాలు వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిపై గృహ హింస, వరకట్నం, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.