భారీగా తగ్గిన వంట నూనెల ధరలు

న్యూఢిల్లీ: సామాన్యులకు ఊరటనిచ్చే న్యూస్ ఇది. ప్రధాన కంపెనీలు వంటనూనె ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. ఎమ్ఆర్​పీపై రూ. 30-40 తగ్గించినట్లు స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది రుచి సోయ( మహాకోష్​, సన్​రిచ్​, రుచి గోల్డ్​, న్యూట్రెల్లా బ్రాండ్స్​), అదానీ విల్​మార్​ (ఫార్చ్యూన్​ బ్రాండ్​), ఇమామి( హెల్తీ అండ్ టెస్టీ బ్రాండ్స్​), జెమిని(ఫ్రీడమ్ సన్​ ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్స్​), బంగే​(డాల్డా, గగన్​, ఛంబల్ బ్రాండ్స్), సీఓఎఫ్​సీఓ (న్యూట్రిలైవ్ బ్రాండ్‌లు), ఫ్రిగోరిఫికో అల్లానా (సన్నీ బ్రాండ్‌లు), గోకుల్ ఆగ్రో (విటాలైఫ్, మహేక్, జైకా బ్రాండ్‌లు)తో పాటు ఇతర బ్రాండ్‌లు కూడా ధరలు తగ్గించాయని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌​ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

ఇటీవల కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే.. ప్రధాన కంపెనీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. వంట నూనెల ధరల తగ్గింపే ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత వంటనూనెల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయా కంపెనీలు ఇటీవలే అనౌన్స్ చేశాయి. వంట నూనెల ఉత్పత్తులపై దిగుమతి పన్ను భారాన్ని మోదీ సర్కార్ ఇటీవల తగ్గించింది. రిఫైన్డ్‌ పామాయిల్‌​పై కస్టమ్స్ డ్యూటీని 17.5 శాతం​ నుంచి 12.5 శాతానికి సవరించింది. డిసెంబర్ 2022 వరకు లైసెన్స్ లేకుండానే రిఫైన్డ్‌ పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడానికి వ్యాపారులకు పర్మిషన్ ఇచ్చింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/