రష్యా, క్రిమియా మధ్య బ్రిడ్జ్పై భారీ పేలుడు
మాస్కో: రష్యా, క్రిమియా మధ్య ఉన్న రైలు, రోడ్డు మార్గంలో భారీ పేలుడు సంభవించింది. కారు బాంబు పేలడంతో ఓ నదిపై ఉన్న బ్రిడ్జ్ ధ్వంసమైంది. ఇక పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జ్ కూడా దెబ్బతిన్నది. రైల్వే బ్రిడ్జ్పై వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్లకు నిప్పు కూడా అంటుకున్నది. క్రిమియాకు ఆ రైలు ట్యాంకర్లు వెళ్తున్నట్లు రష్యా న్యూస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. బ్రిడ్జ్పై జరిగిన పేలుడుకు సంబంధించిన వీడియోలు రిలీజ్ అయ్యాయి. ఉక్రెయిన్ నుంచి క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యా ఆ రూట్లో బ్రిడ్జ్ను నిర్మించింది. అయితే శనివారం ఉదయం ఖార్కీవ్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్న కొన్ని గంటల్లోనే క్రిమియా బ్రిడ్జ్పై కూడా పేలుడు సంభవించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/