కర్ణాటక క్వారీలో భారీ పేలుడు
8 మంది మృతి
Bangalore: కర్ణాటకలోని శివమొగ పట్టణంలో నిన్న రాత్రి సంభవించిన భారీ పేలుడు లో 8 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.
ఈ పేలుడులో మరణించిన వారంతా బీహార్ కు చెందిన వలస కూలీలని చెబుతున్నారు. పేలుడు ధాటికి వారి శరీర భాగాలు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వరకు ఎగిరి పడ్డాయి.
పేలుడు శబ్దం దాదాపు 20 కిలోమీటర్ల వరకు వినిపించింది. ఈ పేలుడు శివమొగ లోని ఓ క్వారీలో సంభవించించింది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/