పిఆర్సి కోసం ఇంకా ఎన్నిరోజులు పడిగాపులు?
2018 జులై నుండి అతీగతీ లేదు
ఉమ్మడి రాష్ట్రంలో గత పిఆర్సిల చరిత్రను చూస్తే గడువ్ఞ ముగిసిందని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తే పిఆర్సి కమిషన్ను నియమించేవారు. కమిషన్ సకాలంలో రిపోర్టు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళనలు తీవ్రతరం చేసేవారు.
దీంతో ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించి అనంతరం ఫిట్మెంట్ ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల 50వేల మంది ఉద్యోగులు, రెండు లక్షల 50వేల మంది పెన్షనర్లు, ఒక లక్షా 50వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములై పనిచేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం ఎంప్లాయి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పగానే మరింత ఉత్సాహంతో ఉద్యోగులు తమ బాగోగులు, కుటుంబ అవసరాలు కూడా మరిచిపోయి అన్నిరకాల రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేటట్లు రాత్రి, పగలు అని తేడా లేకుండా పనిచేస్తున్నారు.
10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను ప్రజలకు పరిపాలన సౌలభ్యం పేరిట 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. దాని ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలో సిబ్బందిని సరిపడా నియమించకపోవడం, ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులనే కొత్త జిల్లాలకు బలవంతంగా పంపించడం వలన తీవ్రమైన పనిభారంతో అనారోగ్యం పాల వ్ఞతూ కూడా పనిచేస్తున్నారు.
వీరందరి బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పది సంవత్సరాలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు సంవత్స రాలకు ఒకసారి పేరివిజన్ కమిషన్లు నియమించబడి రిపోర్టు ఇవ్వాలి. కానీ ఏనాడూ సకాలంలో రిపోర్టులు ఇచ్చిన చరిత్ర లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1958లో మొదటి పే రివిజన్ కమిషన్ ఏర్పడింది.
2014లో రాష్ట్రం విడిపోయే నాటికి వాస్తవానికి 12 పేరివిజన్ కమిషన్లు చేయాల్సి ఉండగా 10 మాత్రమే వేశారు. ఆయా ప్రభుత్వాల పాలకులు చేసిన నిర్లక్ష్యం వలన 10 సంవత్సరాల కాలం అంటే రెండు పిఆర్సిలు ఉమ్మడి రాష్ట్రంలోనే నష్టపోయారు.
ప్రస్తుతం పొందుతున్న పదవ పిఆర్సి గడువ్ఞ 2018 జూన్ 30న ముగిసింది. ఈ గడువ్ఞను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలోని ఉద్యోగ సంఘాల పేరివిజన్ కమిషన్ నియమించాలని డిమాండ్ చేయడంతో 2018 మే 16న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి 2018 మే 18న కమిషన్ వేశారు.
ఆ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఐ.ఆర్ ఇస్తామని ఆగస్టు 15న మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించి పిఆర్సి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ఉద్యోగులు గడువ్ఞకు ముందే పిఆర్సి వస్తుందని సంబరపడిపోయారు.
కానీ జూన్ 2న ఐ.ఆర్ రాలేదు. ఆగస్టు 15న పిఆర్సి ఇవ్వలేదు. గత ప్రభుత్వాల మాదిరిగా సాధారణ ఐ.ఆర్ ఇచ్చిన తర్వాత శాసనసభ ఎన్నికలకు వెళతారని అందరూ అనుకుంటున్న తరుణంలో అదికూడా ఇవ్వకుండానే 2018 సెప్టెంబరు 6న ప్రభుత్వాన్ని ముందస్తుగా రద్దు చేయడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్రనిరాశ నిస్పృహలకు గురైయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 30 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకొని రిటైర్ అయితే కనీసం 100 గజాల స్థలంకానీ, ఒక చిన్న గూడు కానీ నిర్మించుకోలేని దుస్థితిలో ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. కొద్దిమంది అవినీతిపరులను చూపించి అందరినీ ఇరికించడం సరికాదు.
ఉద్యోగులు తీసుకుంటున్న జీతంలో ఐ.టి పేరుతో పది శాతం నుండి 30 శాతం వరకు తిరిగి ప్రభుత్వానికే చెల్లిస్తున్నారు. తెలంగాణ దేశంలోని రెండవ ధనిక రాష్ట్రమని చెప్పుకునే పాలకులు ఉద్యోగుల వేతనాల పెంపుకై తాత్సారం చేయడం అన్యాయం. పైగా అన్ని రాష్ట్రాల కంటే మన దగ్గర ఉద్యోగుల వేతనాలు ఎక్కువని చెప్పడం అబద్ధం.తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు మనవేతనాల కంటే అధికంగా ఉన్నాయి.
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులు 27శాతం వేతనాలు ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రస్తుత పిఆర్సి కాలపరిమితిని 2020 డిసెంబరు 31వరకు పెంచుతూ 2020 ఫిబ్రవరి 17న జిఒ నెం. 447 విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేస్తుందో ఇక్కడ అలాగే చేయాలని చూస్తుంది. ఉద్యోగుల హెచ్ఆర్ ప్రస్తుతం నాలుగు స్లాబులుగా ఉంది. దీన్ని కుదించి రెండు స్లాబులుగా చేయాలని చూస్తుంది.
ఇది పిఆర్సి రిపోర్టులోనే పొందుపరిచి అమలుకు ఆలోచిస్తుందని అధికారులు అంటున్నారు.సిపిఎస్ రద్దు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమే అయినా కేంద్రంమీద నెట్టే ప్రయ త్నం చేస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ అంశం,
ఉద్యో గుల వయోపరిమితి పెంపు లాంటి కీలకమైన అంశాలను పరిష్క రించకపోవడం, మార్చి 8న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగుల ఊసే లేకపోవడం అత్యంత దారుణం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కార్మిక సంఘాల నాయకులను చర్చలకు పిలవాలి. తెగేదాకా లాగకుండా 47శాతం ఫిట్మెంట్తో పిఆర్సి జిఓను విడుదల చేసి అమలు చేయాలి.
-కె.యాదానాయక్,
(రచయిత: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్)
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/