విశాఖ శారదా పీఠం వార్షిక ఉత్సవంలో పాల్గొన సీఎం జగన్

అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు

YouTube video
Hon’ble CM of AP will be Participating in Visakha Sri Sarada Peetham Varshik Mahotsav at VSKP LIVE

విశాఖ: విశాఖ శారదాపీఠం నిర్వహిస్తున్న వార్షికోత్సవాలకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం కోసం ముఖ్యమంత్రితో పండితులు సంకల్పం చేయించారు. అనంతరం అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జగన్ చేతుల మీదుగా కలశ స్థాపన చేయించారు. రాజశ్యామల యాగంలో జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ పాల్గొన్నారు. అనంతరం శారదాపీఠంలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు జగన్ ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/