విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!

అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దీనికి తోడు ఓమిక్రాన్ కేసులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం భారత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఎనిమిది రోజులు తర్వాత ప్రయాణికులందరికి మరోసారి ఆర్టీ పీసీఆర్ పరీక్ష నిర్వహిస్తారు. నేటి నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి.

ప్రయాణీకులందరూ ఎయిర్ సువిధ పోర్టల్‌లో తమ గురించి పూర్తి, సరైన సమాచారాన్ని అందించాలని కేంద్ర ఆరోగ్య శాక కోరింది. ప్రయాణ తేదీకి 14 రోజుల ముందు వరకు చేసిన ఇతర ప్రయాణాల వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుందని సూచించింది. ప్రయాణీకులు పాజిటివ్ RT PCR నివేదికను అప్‌లోడ్ చేయాలి. ఈ పరీక్ష ప్రయాణ తేదీకి గరిష్టంగా 72 గంటల ముందు ఉండాలి. పరీక్ష నివేదిక విశ్వసనీయతకు సంబంధించిన అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ప్రయాణీకుడు క్వారంటైన్, హెల్త్ మానిటరింగ్‌కు సంబంధించిన అన్ని నియమాలను పాటిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి.

కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పటికీ, ప్రయాణీకులు 7 రోజులు తప్పనిసరి హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఎనిమిదో రోజుల తర్వాత వారికి మరోసారి RTPCR పరీక్ష ఉంటుంది. ఎనిమిదో తేదీన నిర్వహించే ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాలను కూడా ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతికూలంగా వచ్చిన తర్వాత కూడా, మీరు తదుపరి 7 రోజుల పాటు మీ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించవలసి ఉంటుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. వచ్చే నెల నాటికి భారతదేశంలో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/