అత్యాచార బాధితురాలికి రూ.10 లక్షల చెక్ అందచేత

బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి తానేటి వనిత

విజయవాడ: రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించారు. సీఎం జగన్ ప్రకటించిన మేరకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల నష్టపరిహారం చెక్ ను అందజేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి వనిత మాట్లాడుతూ.. అత్యాచార ఘటన అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అర్హతలను పరిశీలించి బాధితురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు వచ్చేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/