ట్రైన్ కిందపడి హోంగార్డు ఆత్మహత్య
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి రైల్వేగేట్ సమీపంలో ట్రైన్ కిందపడి మోహన్(32)హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు వరంగల్ ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి స్వస్థలం సంగెం మండల కేంద్రం. అయితే మోహన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/