తెలంగాణ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో హోమాలు
చిక్కడపల్లిలో సుదర్శన హోమం
Hyderabad: కరోనా నుంచి దేశ, రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని కోరుతూ తెలంగాణ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో హోమాలు నిర్వహిస్తున్నారు.
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం హోమం నిర్వహించారు.
కాళేశ్వరం దేవాలయం, బాసర జ్ఞానసరస్వతి దేవి ఆలయంలో, గద్వాల జిల్లా జోగులాంబ దేవాలయం, మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గ భవాని దేవాలయాల్లో మృత్యుంజయ హోమాలు
నిర్వహిస్తున్నారు.
శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం , హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లిలో వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో సుదర్శన హోమం నిర్వహించనున్నారు
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/