సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సెలవు

తహసిల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు యథాతథం

sub-registrar offices -File
sub-registrar offices -File

Hyderabad: నేడు ఎన్నికలు జరిగే  రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లోని సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పని చేయవని, ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టబోరని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

 హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. అయితే తహసిల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/