గవర్నర్‌ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

Dattatreya

హైదరాబాద్‌: హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై నలొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. సూర్యాపేటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతోపాటు డ్రైవర్‌, ఆయన వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. ముగ్గురు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మరో వాహనంలో దత్తాత్రేయ సూర్యాపేటకు వెళ్లిపోయారు.

Bandaru dattatreya vehicle accident


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/