సెక్రటేరియట్‌కు రానున్న సిఎం జగన్‌

మందడంలో పోలీసులు భారీ బందోబస్తు

CM Jagan visit AP secretariat
CM Jagan visit AP secretariat

అమరావతి: ఏపి సెక్రటేరియట్‌కు సిఎం జగన్‌ ఇవాళ రానున్నారు. మరోవైపు రాజధానిని తరలించకూడదని డిమాండ్‌ చేస్తూ… అమరావతి ప్రాంత రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. మందడంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ప్రతి ఇంటి వద్ద పోలీసులు నిలబడ్డారు. రైతుల శిబిరం వద్ద ఎవరూ రోడ్డుపైకి రాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కొత్త శిబిరంలో ఆందోళనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పాత శిబిరంలోనే నిరసనలు కొనసాగించాలని రైతులకు పోలీసులు సూచించారు. మరోవైపు, శాంతియుతంగా తాము చేస్తున్న నిరసన కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగుతున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/