సంగం డెయిరీ పై ప్రభుత్వ జీవో కొట్టివేత

డైరెక్టర్ల పాలనలోనే కొనసాగాలని హైకోర్టు ఆదేశం

Sangam Dairy
Sangam Dairy

Amaravati: సంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదు రైంది. సంగం డెయిరీని తమ ఆధీనంలోకి తీసుకు వస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై సవాల్ చేస్తూ హైకోర్టులో సంగం డెయిరీ డైరెక్టర్లు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. ప్రభుత్వ జీవోను కొట్టివేసింది. సంగం డెయిరీ ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లే కొనసాగవచ్చని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా డెయిరీలో అక్రమాలు జరిగాయని ఏపీ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఎండీ గోపాలకృష్ణన్‌ను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిద్దరికీ కారోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతున్నారు. దీంతో విచారణ కష్టమవుతోందని హైకోర్టుకు సీబీఐ అధికారులు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/