ఏపీ సర్కార్ కు మరో షాక్ ఇచ్చిన హైకోర్టు

జగన్ సర్కార్ కు వరుస షాకులు ఇస్తున్న హైకోర్టు..మరోసారి షాక్ ఇచ్చింది. ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల పై కాలేజీల అసోసియేషన్, స్టూడెంట్లు వేసిన పిటీషన్ల పై ఇవాళ హై కోర్టు లో విచారణ జరిగింది. అయితే ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల విషయం లో ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి యధావిధిగా అడ్మిషన్లు కొనసాగించాలని తీర్పులో స్పష్టంగా పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లను అందరి అభిప్రాయాలు తీసుకొని ఆన్లైన్లో నిర్వహించవచ్చని సూచించిన హైకోర్టు… ఈ విద్యా సంవత్సరానికి గతంలో మాదిరిగా అడ్మిషన్లు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది.

కాలేజీల అసోసియేషన్, స్టూడెంట్లు వేసిన పిటీషన్లపై విచారణ జరిపింది. ప్రభుత్వం నుంచీ సరైన విధి విధానాలు ఇవ్వలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్ లైన్ అడ్మిషన్ విధానం ప్రవేశపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళింది. అయితే ఏపీ ప్రభుత్వ వాదనలను తోసి పుచ్చిన ఏపీ హైకోర్ట్… ఆన్ లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ ను కొట్టేసింది. తాము ఆదేశించిన విధంగా నడుచుకోవాలని సూచనలు చేసింది.