విరిగిన కొండచరియలు.. ఐదుగురు మృతి

మరో 38 మంది మిస్సింగ్‌

landslides in Nepal

ఖాట్మండు: నేపాల్‌లోని సింధుపాల్‌చోక్ జిల్లాలో శుక్ర‌వారం ఉద‌యం ఘోర ప్రమాదం సంభవించింది. కొండ చ‌రియ‌లు విరిగిప‌డి ఐదుగురు మృతిచెంద‌గా మ‌రో 38 మంది జాడ తెలియ‌కుండా పోయింది. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై లామా టోల్ వార్డ్ చీఫ్ ప్ర‌తాప్ లామా స్పందిస్తూ… ఈ ఉద‌యం 6:30 గంటలకు కొండచరియలు విరిగిపడి ఇళ్ల‌న్ని నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. 12 ఇండ్ల‌కు పైగా తుడిచిపెట్టుకుపోయాయి. శిధిలాల నుండి ఐదు మృతదేహాలను వెలికితీశాం. ఎనిమిది మందికి తీవ్ర గాయప‌డ్డారు. సుమారు 38 మంది ఆచూకీ తెలియ‌కుండా పోయింద‌ని వెల్ల‌డించాడు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/