తిరుపతి సమీపంలో వాయుగుండం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

Vayugundam near Tirupati

అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో వాయుగుండం కొనసాగుతుంది. తిరుపతికి ఉత్తర దిశగా 35 కిలోమీటర్లు, నెల్లూరుకు నైరుతి దిశగా 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. కొన్ని గంటల్లో ఈ వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కాగా, ఇప్పటికే నివర్‌ తుపాను ప్రభావంతో దక్షిణి ఏపిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. చేతికొచ్చిన పంట నాశనమైపోయిందని రైతులు కంటతడి పెడుతున్నారు. మరోవైపు తిరుపతి సమీపంలో ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/