నాగార్జునసాగర్‌కు భారీ వరద.. 20 గేట్లు ఎత్తివేత

nagarjuna-sagar
nagarjuna-sagar

నల్లగొండః భారీ వర్షల కారణంగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి సాగర్‌కు 3.14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 20 క్రస్ట్‌ గేట్లను ఎత్తి 2.27 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులుగా ఉన్నది. జలాశయం గనిష్ట నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ఇప్పుడు 308.35 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. సాగర్‌ కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ప్రధాన జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/