బాంబు దాడి..12 మంది మృతి

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బాంబు పేలి 12 మంది మరణించారు. మసీదుకు వచ్చే వారే లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగింది. ఆదివారం మసీదు వద్ద తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ తల్లి స్మారక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా బాంబు పేలింది. దీంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించలేదు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/