వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త
భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధర
న్యూఢిల్లీ : వంట గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు శుభవార్త తెలిపాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో 14.2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.207 తగ్గి.. రూ.589.50 నుంచి ప్రారంభం కానుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర సైతం రూ.336 తగ్గి.. రూ.988 నుంచి ప్రారంభం అవుతుంది. నెలవారీ సమీక్షలో ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం వల్లే మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి. ఈ ధరలన్నీ మే ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తుండడం గమనార్హం. ఇక ఢిల్లీలో ఎలీపీజీ సిలిండర్ ధర రూ.744 నుంచి రూ.581.50కి పడిపోయింది. ముంబై నగరంలో రూ.714.50 నుంచి రూ.579కి దిగొచ్చింది. కోల్కతాలో ఒక్కో సిలిండర్పై రూ.190 తగ్గి రూ.584.50 కాగా, చెన్నై నగరంలో రూ.569.50కు ధర పడిపోయింది.
తాజా వీడియోస్ వార్తల కోసం క్లిక్ చేయండి:
https://www.vaartha.com/videos/