బెయిల్ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా
కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ‘సుప్రీం’ ఆదేశం
New Delhi: సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ బి. ఆర్. గవాయితో కూడిన ద్విసభ్య ధర్మాసనం.,, బెయిల్ పిటిషన్పై సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/news/sports/