రైతుల పాదయాత్ర రద్దు చేయాలన్న పిటిషన్‌ విచారణ వాయిదా

Ap High Court
ap-high-court

అమరావతి : అమరావతి రైతుల పాదయాత్ర అనుమతి రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటీషన్‌పై గురువారం హైకోర్టు లో విచారణ జరిగింది. పాదయాత్రపై కోర్టు విధించిన ఆంక్షలను తొలగించాలని వేసిన పిటీషన్‌లను కలిపి ధర్మాసనం విచారిస్తోంది. పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు , ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. పాదయాత్రలో రైతులు 600 మంది మొదటి నుంచి చివర వరకూ పాల్గొనడం కష్టమని, రొటేట్ అవుతూ ఉంటారని న్యాయవాదులు చెప్పారు. మహిళలు ఎక్కువ మంది ఉండటంతో వారి సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని వాదించారు. పాదయాత్రలో పాల్గొనే వారికి ముందు, వెనుక సంఘీభావం తెలిపే వారు ఉంటారని న్యాయవాదులు పేర్కొన్నాచరు. సంఘీభావం తెలిపే వారిని రోడ్డుకు ఇరువైపులా ఉండాలని మొదటి ఉత్తర్వుల్లో లేదని చెప్పారు. కోర్టు మధ్యాహ్నం 12:30 గంటలకు ఉత్తర్వులు ప్రకటిస్తే …. వెనువెంటనే పోలీసులు ఆంక్షలు విధించారని న్యాయవాది ఉన్నం మురళీధర్ చెప్పారు. వెంటనే ఆంక్షలు విధించి భోజనం చేసే ఫంక్షన్ హాల్‌కు వెళ్లి ఐడీ కార్డులు చూపించమన్నారని పిటీషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. డీజీపీ కార్యాలయం 150 మందికి మాత్రమే ఐడీ కార్డులు ఇచ్చారని మురళీధర్ తెలిపారు.

కాగా.. ఈ విషయంపై విచారణకు తమకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును అడిగారు. అయితే తాము పాదయాత్రను పోలీసుల ఆంక్షలు కారణంగా బలవంతంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, అందువల్ల వెంటనే విచారించాలని పిటీషనర్లు పట్టుబట్టారు. దీంతో రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు అన్ని పిటీషన్‌లను కలిపి విచారించి ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం, పిటీషనర్‌లు ఆచరణ యోగ్యమైన ప్రతిపాదనలతో రావాలని హైకో