ఈ ఏడాదిలో హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం
40 ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం
హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు. చింతమడకలో యశోద ఆస్పత్రి సహకారంతో హెల్త్ ప్రొఫైల్ ఏర్పాటు చేశామని, గజ్వేల్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నామన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది చివరి వరకు హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని వివరించారు. కిడ్నీ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని, 40 ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, కంటి వెలుగు ద్వారా 40 లక్షల మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేశామని ఈటెల పేర్కొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/