లవర్ కోసం స్నేహితుడ్ని హత్య చేసాడు..ఈసారి ఎక్కడంటే..!

ప్రేమ గుడ్డిదంటారు..ప్రేమలో ఉన్నవారు లోకాన్నే మరచిపోతారు. ప్రేమలో ఏంచేస్తున్నారో కూడా తెలియదు. తమ ప్రాణాలనే కాదు మరొకరి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు. రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రేమించిన యువతీ కూడా స్నేహితుడినే అతి దారుణంగా చంపిన ఘటన ఇంకా వార్తల్లో ప్రచారం అవుతుండగానే..తాజాగా కర్నూల్ లో ఇదే తరహాలో దారుణం జరిగింది. లవర్ కోసం స్నేహితుడ్ని చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.

జనవరిలో కర్నూలు ఎర్రబురుజు కాలనీకి చెందిన మురళీ కృష్ణ హత్యకు గురయ్యాడు. మురళీ కృష్ణ ను అతని స్నేహితులు దినేష్ కుమార్, కిరణ్ కుమార్ హత్య చేశారు. దినేష్ కుమార్ ప్రియురాలు నగ్న వీడియోలను ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని, బ్లాక్ మెయిల్ చేశాడు మురళి. మురళి వేదింపులు రోజు రోజుకు ఎక్కువైపోతుండడంతో సదరు యువతీ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇక ప్రియురాలిని వేధించాడని కక్ష పెంచుకున్న దినేష్… జనవరి 25న మురళి ని పంచలింగాల దగ్గరకు తీసుకువెళ్లి గుండెలో కత్తితో పొడిచి చంపేశాడు. మృతదేహాన్ని నగర శివారులోని హంద్రీనీవా కాలువలో పడేశారు. తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు మురళీకృష్ణ తల్లి దండ్రులు. ఇక పోలీసుల దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. మురళీకృష్ణ మృతదేహం కోసం హంద్రీనీవా కాలువ లో 10 కి.మీ మేర గాలించారు పోలీసులు. మురళీకృష్ణ మృతదేహం ఇంకా దొరకలేదు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.