హోంక్వారంటైన్లో హర్యానా సిఎం ఖట్టర్
కరోనా లక్షణాలున్న వారిని కలిసిన సిఎం
చండీగఢ్: హర్యానా సిఎం మనోహర్ లాల్ కట్టర్ ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్లోకి వెళ్లారు. కరోనా బారినపడిన కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను సిఎం ఈ నెల 19న కలిసి సమావేశంలో పాల్గొన్నారు. అలాగే, కరోనా లక్షణాలున్న పలువురిని కలిశారు. దీంతో అప్రమత్తమైన సిఎం.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో నెగటివ్ వచ్చినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు మనోహర్లాల్ ప్రకటించారు. మరోవైపు, షెకావత్తో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేంద్ర సహాయమంత్రి రతన్లాల్ కటారియా కూడా హోం క్వారంటైన్లోకి వెళ్లారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/