బిజెపి నేతలపై హరీశ్ రావు ఆగ్రహం

హైదరాబాద్‌: మంత్రి హరీశ్‌ రావు తెలంగాణ బిజెపి నేతలపై మండిపడ్డారు. నోరు ఉంది కదా అని బిజెపి నేతలు ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారికి చేతనైతే ఢిల్లీలో మాట్లాడాలని అన్నారు. కేంద్రం పెద్దలను నిలదీయాలని సూచించారు. బిజెపి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందని, ఇప్పుడు బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసీలను అమ్మేయాలని చూస్తోందని ఆరోపించారు.

బిజెపికి ఎందుకు ఓటు వేయాలి?… పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినందుకు ఓటు వేయాలా? అని హరీశ్ రావు నిలదీశారు. ఎరువుల సబ్సిడీని బడ్జెట్ లో రూ.2 లక్షల కోట్లు తగ్గించారని వెల్లడించారు. బిజెపి ఏమీ చేయకపోవడమే కాకుండా, రాష్ట్రానికి రావాల్సింది కూడా ఇవ్వడంలేదని విమర్శించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/