జేపీ నడ్డా సొంత రాష్ట్రంలోనే బోర్లా పడ్డారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా

బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఫై బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో బోర్లా పడ్డ నడ్డా… తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెపుతారని అన్నారు. అలాగే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కు ఈడీ నోటీసులపై కూడా హరీష్ రావు స్పందించారు.

రోహిత్ రెడ్డికి నోటీసులు వస్తాయని రెండు రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే నోటీసులు వచ్చాయని చెప్పారు. బీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఉద్దేశపూర్వకంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని విమర్శించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని హరీశ్ మండిపడ్డారు.