రైతుల కోసం టిఆర్ఎస్ ఎంతో చేసింది
మీటర్లు కావాలంటే బిజెపికి, మీటర్లు వద్దనుకుంటే టిఆర్ఎస్ కు ఓటేయండి
సిద్ధిపేట: ఈరోజు సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో మంత్రి హరీశ్ రావు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీటర్లు కావాలనుకుంటే బిజెపికి, మీటర్లు వద్దు అనుకుంటే మన కెసిఆర్ సారుకు, టిఆర్ఎస్ కారుకు ఓటేయాలని అన్నారు. గత ఆరేళ్లుగా టిఆర్ఎస్ సర్కారు రైతుల కోసమే పనిచేసిందని, కానీ బిజెపి రైతులకు మేలు చేయకుండా బాంబులు వేస్తోందని విమర్శించారు. బావుల వద్ద, బోర్ల వద్ద మీటర్లు ఏర్పాటు చేసి, బిల్ కలెక్టర్లతో వసూళ్లు చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే, ప్రజలు సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు ఓట్ల కోసం వచ్చే వారెవరో, కష్టపడి పనిచేస్తున్నది ఎవరో గుర్తించాలని తెలిపారు. తెలంగాణలో కరోనా వంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఎక్కడా నిలిచిపోలేదని స్పష్టం చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/