హరీష్ రావు పర్యటన లో ఈటల రాజేందర్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నోరుజారారు

హుజురాబాద్ ఉప ఎన్నిక పోరు ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పని లేదు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తెరాస , బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో బిజీ అయ్యాయి. అయితే ముఖ్యంగా ఈ ఎన్నికలు బిజెపి – తెరాస ల మద్యే పోటీ నెలకొనుంది. మొదటి నుండి హుజురాబాద్ బాధ్యత హరీష్ రావు చేతిలో పెట్టడం తో నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

అయితే ఆయన ప్రచారం చేస్తుండగా అలవాటులో పొరపాటు దొర్లింది. మంత్రి హరీశ్ రావు కాన్వా‌య్‌లో ఉన్న ఓ కార్యకర్త సీఎం కేసీఆర్‌కు జై కొడుతూ ఈటల రాజేందర్ నాయకత్వం వర్దిల్లాలి అని నినదించారు. దీంతో అదే కాన్వాయ్‌లో ఉన్న పాడి కౌసిక్ రెడ్డి కూడా ఈటల నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదం చేశారు. వెంటనే మంత్రి హరీశ్‌రావు మైక్ తీసుకుని ఈటల రాజేందర్‌తో 15 ఏళ్ల బంధం అంటూ అలవాటులో పొరపాటు జరిగిందని కవర్ చేసారు.