రాహుల్ సభలో అదిరిపోయే స్టెప్స్ వేసిన VH , దామోదర రాజనర్సింహ

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం సంగారెడ్డి లో ఈ యాత్ర కొనసాగుతుంది. గురువారం రాత్రి పాదయాత్రను ముగించే సందర్భంగా జిల్లా పరిధిలోని అందోల్ లో భారీ బహిరంగ సభను జరిగింది. అందోల్ సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. ఈ స్పందనను చూసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు సంబరాలు చేసుకున్నారు.

రాహుల్ ప్రసంగం ముగియగానే సంతోషం పట్టలేక మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన పక్కనే ఉన్న నేతలతో కలిసి అదిరిపోయే స్టెప్స్ వేశారు. దామోదరను స్టెప్పులను చూసిన సీనియర్ నేత వి.హన్మంతరావు తన వయసును సైతం లెక్క చేయకుండా డ్యాన్స్ చేశారు. ఇద్దరు కీలక నేతలు స్టేజీ మీదే మైమరచి స్టెప్పులేస్తున్న వైనం చూసి పార్టీ కార్యకర్తలు హుషారుగా కేరింతలు కొట్టారు. ప్రస్తుతం ఈ డాన్స్ కు సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇక ఈ నెల 07 తో రాహుల్ యాత్ర తెలంగాణాలో పూర్తి అవుతుంది. నెక్స్ట్ మహారాష్ట్ర లో యాత్ర కొనసాగించబోతున్నారు. ఈ క్రమంలో ఈ నెల భారీ వీడ్కోలు సభ ఏర్పాటు చేయబోతుంది టీ కాంగ్రెస్. దీనికి సంబదించిన విషయాలను మీడియా తో పంచుకున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాహుల్ పాదయాత్రకు సంబంధించి నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర ముగియనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణపై వారు చర్చించారు.