కర్నూలు సెంటర్లో ఉరివేసుకుంటా..
తాను తప్పు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరిన హఫీజ్ ఖాన్
కర్నూలు: కరోనా కారణంగా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. వైయస్ఆర్సిపి,టిడిపి మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది. కర్నూలులో కరోనా వ్యాప్తికి హఫీజ్ ఖాన్, ఎంపి సంజీవ్ కుమార్ తీరే కారణమని అఖిల ప్రియ వ్యాఖ్యానించగా.. ఆమె వ్యాఖ్యలపై హఫీజ్ఖాన్ తీవ్ర స్థాయిలో ఖండించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో అందరికంటే తాను ముందున్నానని, మసీదులను మూసివేయించానని, తబ్లీగీ జమాత్కు వెల్లిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించానని చెప్పారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే కర్నూలు సెంటర్లో ఉరివేసుకుంటానని సవాల్ విసిరారు. ఆమెకు జిల్లా పరిస్థితులు కూడా సరిగ్గా తెలియవని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రజలకు సేవ చేయడం మానేసి, రాజకీయ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/