తెలంగాణలో రేపటి నుంచి హాఫ్ డే స్కూల్స్

ఉద‌యం 8 నుంచి12.30 గంట‌ల వ‌ర‌కు క్లాసులు
పాఠ‌శాల విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ

Half-day schools from March 15 in Telangana

హైదరాబాద్ : ఎండ‌లు మండిపోతున్న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం రేప‌టి నుంచే (మార్చి 15) హాఫ్ డే స్కూల్స్ ప్రారంభించ‌నున్న‌ట్లుగా తెలిపింది. ఈ మేర‌కు పాఠ‌శాల విద్యా శాఖ సంచాల‌కురాలు శ్రీ దేవ సేన సోమవారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో రేప‌టి నుంచే హాఫ్ డే స్కూల్స్ ప్రారంభిస్తున్న‌ట్లు స‌ద‌రు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్న పాఠ‌శాల విద్యా శాఖ ప్రైవేట్ పాఠ‌శాల‌ల ఊసు ఎత్త‌లేదు. సాధార‌ణంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల మాదిరే ప్రైవేట్ పాఠ‌శాల‌లు కూడా త‌మ టైం టేబుల్‌ను మార్చేసుకుంటున్న‌నేప‌థ్యంలో ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లోనూ రేప‌టి నుంచే హాఫ్ డే స్కూల్స్ ప్రారంభ‌మయ్యే అవకాశాలున్నాయి. ఇక హాఫ్ డే స్కూల్స్ టైమింగ్స్ విష‌యానికి వ‌స్తే.. ఉద‌యం 8గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు పాఠ‌శాల‌లు ప‌నిచేయ‌నున్నాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/