పోలింగ్ కేంద్రాలను సందర్శించిన గుంటూరు రూరల్ ఎస్పీ
అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు
Guntur: గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల వద్ద రూరల్ ఎస్పీ విశాల్ గున్ని బందోబస్తును పరిశీలించారు ,పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులకు సూచించారు. యడ్లపాడు జెడ్పి హెచ్ స్కూల్ లోని పోలింగ్ కేంద్రాలను రూరల్ ఎస్పీ పరిశీలించారు. అక్కడ పోలింగ్ కేంద్రానికి తన ఓటుహక్కు వినియోగించుకోవడానికి వచ్చిన మహిళతో మాట్లాడి,ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/