డోగోన్స్పై కాల్పులు జరిపిన దుండగుడు
కాల్పుల్లో 41 మంది మృతి

జొహెన్నస్బర్గ్: పశ్చిమ ఆఫ్రికాలోని సెంట్రల్ మాలీలో గుర్తు తెలియని దుండగుడు బీభత్సం సృష్టించాడు. తుపాకితో అక్కడున్న రెండు గ్రామాల్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపి 41 మందిని చంపేశాడు. మృతులంతా డోగోన్స్ జాతికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఐతే గతంలో పులానీ, డోగోన్స్ జాతుల మధ్య భూవివాదాలు, నీటి సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజుల క్రితం పులానీ వర్గానికి చెందిన వారు డోగోన్స్పై దాడి చేసి 35 మందిని చంపేశారు.
తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/latest-news/