మెక్సికోలో కాల్పులు.. 8మంది మృతి

మెక్సికో: ఉత్తర-మధ్య మెక్సికోలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులతో సహా ఎనిమిది మంది మరణించారని అధికారులు తెలిపారు. రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. గ్వానాజువాటో రాష్ట్రంలోని సిలావో నగర శివార్లలోని సైకిళ్లపై వచ్చిన దుండగులు ఓ ఇంట్లో దాగి ఉన్న డ్రగ్స్ ముఠాను టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు. ఈఘటనలో ఓ ఇంట్లో 16 ఏళ్ల బాలిక, 16 నెలల బాలుడుతో సహా ఎనిమిది మంది తుపాకీ గుళ్లకు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సిలావో నగర శివార్లలో దాడి చేసిన వారు ఒక ఇంట్లో ఉన్న నలుగురు పురుషులను లక్ష్యంగా చేసుకున్నారని, వారిలో ఒక మహిళ కూడా చనిపోయారని పోలీసులు తెలిపారు.

మాదకద్రవ్యాల రవాణపై ఉక్కుపాదం మోపుతున్న మెక్సికో ప్రభుత్వం 2006లో నిషేధం విధించింది. ఈ క్రమంలోనే సైనిక చర్యకు సైతం పాల్పడింది. అయినప్పటికీ మాదకద్రవ్యాల అక్రమ దందా ఆగడంలేదు. ఇదిలావుంటే, అధికారుల గణాంకాల ప్రకారం.. మెక్సికో దేశంలో 3 లక్షలకు పైగా మాదకద్రవ్యాల కారణంగా హత్యలు నమోదయ్యాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/