కోనసీమలో ఫైనాన్స్ వ్యాపారిపై నాటుబాంబులతో దాడికి యత్నం..

అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల ఆదిత్య రెడ్డిపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అతడిపై నాటుబాంబులు , గన్‌తో దాడికి యత్నించి విఫలమయ్యారు. ఆదిత్యరెడ్డి ప్రతిఘటించడంతో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

ఈ కాల్పుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ కాల్పులకు ఆర్థిక లావాదేవీలు కారణమా.. ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్నిది తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.. అలాగే ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించే పనిలో ఉన్నారు.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో కాల్పులు, నాటు బాంబులు కనిపించడం స్థానికంగా కలకలంరేపుతోంది.