గుజరాత్లో కరోనా విజృంభన
24 గంటల్లో 20 మంది మృతి
గుజరాత్: కరోనా మహమ్మారి గుజరాత్లో విలయతాంతడవం చేస్తుంది. గత 24 గంటల్లో ఏకంగా 347 కేసులు నమోదు కాగా, 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 19 మంది ఒక్క అహ్మదాబాద్లోనే మరణించడం విశేషం. కాగా తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 8,542కు చేరుకోగా, మరణాల సంఖ్య 513కు పెరిగింది. ఒక్క అహ్మదాబాద్లోనే 6,086 కేసులు నమోదు కావడం గమనార్హం. అలాగే, కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,780 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/