కెసిఆర్‌తో శంకర్‌ సింఘ్ వాఘేలా సమావేశం

gujarat-former-chief-minister-shankar-singh-vaghela-meets-kcr-today

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌తో గుజరాత్‌ మాజీ సిఎం శంకర్‌సింఘ్‌ వాఘేలా నేడు ప్రగతి భవన్‌లో భేటి అయ్యారు. ఇరువురు నేతలు దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చాలా సేపటి వరకు చర్చించారు. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలు కలిసి పెను మార్పు తీసుకురావాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. బిజెపి వైఫల్యాలు, మతతత్వ రాజకీయాలు అనే అంశాలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే విషయం గురించి ఇరువురు మాట్లాడారు.ప్రత్యక్ష జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇందులో భాగంగానే కెసిఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నాయకులను హైదరాబాద్‌కు రమ్మని ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడబెట్టుకుంటున్నారు. కేంద్రంలోకి బిజెపి రహిత ప్రభుత్వం రావాలనే నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఇదే నినాదంతో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కెసిఆర్‌కు మద్దతు పలుకుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/