గుజరాత్‌ సిఎంకు కరోనా పాజిటివ్‌

సభలో మాట్లాడుతూ వేదికపై పడిపోయిన విజయ్ రూపానీ

అహ్మదాబాద్‌: గుజరాత్‌ సిఎం విజయ్ రూపానీ వడోదరాలో ఓ సభలో మాట్లాడుతుండగా వేదికపైనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అస్వస్థతతో ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అలిసిపోయి సొమ్మసిల్లి పడిపోయారని బిజెపి శ్రేణులు తొలుత పేర్కొన్నాయి. అయితే సిఎం విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్ అని తాజాగా వెల్లడైంది. వేదికపై స్పృహ కోల్పోయిన ఆయనను హుటాహుటీన హెలికాప్టర్ ద్వారా అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిఎం రూపానీ కరోనా బారినపడినట్టు ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఈసీజీ, సీటీ స్కాన్ రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని, ఆందోళన కలిగించే పరిస్థితులు ఏమీ లేవని యూఎన్ మెహతా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్కే పటేల్ వెల్లడించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/