పవన్ మార్షల్ ఆర్ట్స్ పిక్ ఫై మంత్రి గుడివాడ అమర్ నాథ్ సెటైర్

జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను టర్గెట్ గా పెట్టుకున్నారు వైస్సార్సీపీ నేతలు. పవన్ కళ్యాణ్ ఏంచేసినా , సోషల్ మీడియా లో ఏ పోస్ట్ పెట్టిన దానిపై విమర్శలు చేయడం , సెటైర్లు , కౌంటర్లు ఇవ్వడం చేస్తున్నారు.తాజాగా పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి కలర్ విషయంలో పెద్ద వివాదమే సృష్టించిన నేతలు..తాజాగా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన మార్షల్ ఆర్ట్స్ పిక్ ఫై మంత్రి గుడివాడ అమర్ నాథ్ సెటైర్ వేశారు.

స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పవన్ కళ్యాణ్.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీ కావడంతో దాన్ని వదిలిపెట్టేశారు. ఇది జరిగి 20 ఏళ్లు దాటిపోయాయి. అయితే తాజాగా మార్షల్ ఆర్ట్స్ ఎందుకో ఆయనకు గుర్తుకొచ్చింది. దీంతో ట్విట్టర్ లో ఓ ఫొటో ఫోజు పెట్టి 20 ఏళ్ల తర్వాత తిరిగి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మొదలుపెడుతున్నా అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు, నేతలు కూడా ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ స్వాగతిస్తున్నారు. అయితే వైస్సార్సీపీ మంత్రి గుడివాడ మాత్రం పవన్ పెట్టిన పోస్ట్ ఫై కౌంటర్ వేశారు.

పవన్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఇది మార్షల్ ఆర్ట్సా పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు. చేతిలో ఓ పదునైన కత్తి వంటి ఆయుధం పట్టుకుని పవన్ ఇచ్చిన ఫోజును ఎద్దేవా చేస్తూ ఇది మార్షల్ ఆర్ట్సా అని ప్రశ్నించారు.