జిఎస్‌టీ రికార్డు.. రూ. 1.55 లక్షల కోట్లు పెరిగిన వసూళ్లు

GST rises rs1.05 lakh crore
GST rises rs1.05 lakh crore

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టీ) వసూళ్లు అంతకంతకూ పెరుగుతూ ప్రభుత్వ ఖజానాను నింపుతున్నాయి. ఫిబ్రవరిలో జిఎస్‌టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలు దాటాయి. ఈ స్థాయిలో వసూలు కావడం ఇది వరుసగా నాలుగోసారి. ఫిబ్రవరిలో జిఎస్‌టీ కింద రూ.1,05,366 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 8.3 శాతం అధికం కాగా, జనవరితో పోలిస్తే మాత్రం తక్కువ. ఆ నెలలో ఏకంగా రూ.1.10 లక్షల కోట్లు వసూలైంది. ఫిబ్రవరిలో వసూలైన రూ.1,05,366 కోట్లలో సీజిఎస్‌టీ వసూళ్లు రూ.20,569 కోట్లు కాగా, ఎస్‌జిఎస్‌టీ కింద రూ.27,348 కోట్లు, ఐజిఎస్‌టీ కింద రూ.48,503 కోట్లు వసూలయ్యాయి. సెస్‌ల రూపంలో 8,947 కోట్లు వసూలైంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/